న్యూఢిల్లీ కేంద్రంగా సాగుతున్న ఈ గణనలో కేరళ, నాగాలాండ్ వంటి ప్రాంతాల్లో ప్రజలు 15 రోజుల పాటు ఆన్లైన్ ద్వారా స్వయంగా వివరాలు నమోదు చేసుకుంటున్నారు. వెబ్సైట్ ద్వారా నమోదు చేయని వారి ఇళ్లకు అధికారులు వెళ్లి, ప్రత్యేక మొబైల్ యాప్ సాయంతో డేటాను సేకరిస్తున్నారు.
మంగళవారం హిమాచల్ ప్రదేశ్లో ఈ తొలి దశ ప్రారంభమవగా, గుజరాత్, జమ్ముకశ్మీర్, లద్దాఖ్, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్ల్లో ఇప్పటికే ప్రక్రియ మొదలైంది. 2027 సంవత్సరానికిగాను నిర్వహిస్తున్న ఈ జనాభా లెక్కల తొలి దశ 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో విజయవంతంగా పూర్తయింది.







