తిలక్ వర్మ నేతృత్వంలోని ఇండియా-ఎ జట్టు, ఆతిథ్య శ్రీలంక-ఎ జట్టుతో జరిగిన రివర్స్ ఫిక్స్‌చర్ మ్యాచ్ సూపర్ ఓవర్‌లో పరాజయం పాలైంది. 265 పరుగుల చొప్పున రెండు జట్లు స్కోర్ చేయడంతో టై అయిన మ్యాచ్‌లో, సూపర్ ఓవర్‌లో లంక 18 పరుగులు చేయగా, భారత్ కేవలం 9 పరుగులే చేసి ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత భారత ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చలు జరుపుతుండగా, స్టేడియం ఖాళీ అయినా 70 ఏళ్ల అనుర తెన్నెకూన్ మాత్రం బయటే నిలబడి ఉన్నారు.

15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బయటకు రాగానే అతనితో మాట్లాడిన అనుర తెన్నెకూన్, ఐపీఎల్ 2026లో అతని ప్రదర్శనకు అభిమానిగా మారిపోయానని తెలిపారు. బయట వినిపించే విమర్శలు, గొడవలను పట్టించుకోవద్దని, కేవలం ఆటపైనే దృష్టి పెట్టాలని సలహా ఇచ్చారు. కాగా, ఐపీఎల్‌లో 776 పరుగులు చేసిన వైభవ్, శ్రీలంక పర్యటనలో 3 ఇన్నింగ్స్‌లో కేవలం 79 పరుగులే చేసి నిరాశపరిచాడు. ఈ ఒత్తిడిలోనే మైదానంలో లంక ఆటగాడితో గొడవకు దిగినట్లు సమాచారం.